Indian History

                   పూర్వ చరిత్ర
భూమి మీద ఆవిర్భవించింన మొట్టమొదటి జీవి - లార్వా
లార్వా అనంతరం ఆవిర్భవించింన జీవి - ప్లాజిలెట్టా
లిపి ఆవిర్భావమే నాగరికతకు చిహ్నం అని వివరించిన వారు -గార్డన్ చైల్డ్
లిపి ఆధారంగా చరిత్రను 3 యుగాలుగా వర్గీకరించారు
1) పూర్వ ప్రాచీన యుగం(pre historical age)
2) చారిత్రక సంధి యుగం(proto historical age)
3) చారిత్రక యుగం(Historical age)
పూర్వ ప్రాచీన చరిత్ర ను శిలా యుగాలుగా వర్గీకరించారు 

ప్రాచీన శిలా యుగం:-(palio lithic age) (25000BC-10000)


          ఈ యుగం లో ఆది మానవుడు సంచార జీవనాన్ని గడుపుతూ మ్పగప్రాయుడై ఉండే వాడు.ఈ యుగంలో మానవుడు ఉపయోగించిన శిలలు పరిమాణం పెద్దవి.ఈ యుగానికి సంబంధించిన ఆధారాలు తమిళనాడు లోని పల్లవరంలో, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ , తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లాలో లభించాయి.

మధ్యరాతి శిలా యుగం:-(Miso lithic age)( 10000BC- 4000)
 
                ఈ యుగం లో మానవుడు నీటి పరివాహక ప్రాంతాల వద్ద కొంత కాలం స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.ఈ యుగంలో మానవుడు నిప్పు ను కనుగొన్నారు.మానవుడు ఉపయోగించిన శిలలు పరిమాణం చిన్నవి.ఎముకతో కూడి హాని ఆయుధాలను ఉపయెగించినాడు.

నవీన రాతి శిలా యుగం:- (modern age)( 4000 BC- 1000)

               ఈ యుగం లో మానవుడు జంతువులు ను మచ్చిక చేసుకొన్నాడు.మానవుడికి మచ్చికైన మొదటి జంతువు కుక్క.ఈ యుగంలో వ్యవసాయాన్ని ప్రారంభించాడు.కుమ్మరి చక్రాన్ని ఉపయోగించి కుండలను తయారు చేసి వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరిచారు.

ప్రాచీన మానవుని లిపి చిత్రాలు కనిపించే ప్రదేశం - కేతువరం( కర్నూల్ జిల్లా)
ప్రాచీన మానవుడు ఉపయోగించిన లోహం - రాగి

విలియం జోన్స్ ను " ఫాదర్ ఆఫ్ ఇండాలజీ" అంటారు.

ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ- అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్స్


 

Previous Post Next Post